ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేదార్‌నాథ్ ఆలయంలోకి నాన్ హిందువల ప్రవేశాన్ని నిషేధించాలి..: బీజేపీ ఎమ్మెల్యే

national |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 07:45 PM

కేదార్‌నాథ్ ఆలయంలోకి నాన్ హిందువల ప్రవేశాన్ని నిషేధించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియాల్ డిమాండ్ చేశారు. ఇతర మతాలకు చెందిన వాళ్లు అక్కడకు వస్తూ.. హిందూ యాత్రికుల మనోభావాలను దెబ్బతీసే కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అనేక సమస్యల గురించి తనకు తెలిసిందని.. అందుకే కేదార్‌నాథ్ యాత్ర ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే తాను ఈ రకమైన డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


కొన్ని హిందూయేతర శక్తులు కేదార్‌నాథ్ ధామ్ పవిత్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేదార్‌నాథ్ ఎమ్మెల్యే ఆశా నౌటియాల్ తెలిపారు. ఇలాంటి వారిని గుడిలోకి రాకుండా నిషేధాన్ని విధించాలన్నారు. ఈవిషయంపై ఇటీవలే మంత్రి ఇంఛార్జీ సౌరభ్ బహుగుణ స్థానిక అధికారులు, నివాసితులతో సమావేశం నిర్వహించారని చెప్పారు. ఇందులో పాల్గొన్న కొందరు ప్రజలు.. ఇతర మతాలకు చెందిన వ్యక్తులు కేదార్‌నాథ్ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని సూచించారని అన్నారు.


అలాంటి వ్యక్తులను గుర్తించిన ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని ప్రతిపాదించినట్లు బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియా వెల్లడించారు. ఆ నిర్ణయాన్ని తాను కూడా స్వాగతిస్తున్నానని.. అందుకే ఆలయంలోకి ఇతర మతాల వాళ్లను రానివ్వకుండా నిషేధం విధించాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆశా నౌటియాల్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూనే.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్పందిస్తూ.. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకులకు అలవాటని అన్నారు. ఉత్తరాఖండ్ ఒక దేవ భూమి అని దానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని మతంతో ఎన్నాళ్లు ముడి పెడతారంటూ ప్రశ్నించారు. ప్రజలకు చెప్పేందుకు వారి వద్ద ఎలాంటి విషయాలు లేకే ఇలాంటి వాటి గురించి మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇదిలా ఉండగా.. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30వ తేదీ నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఆరోజు గంగోత్రి మరియు యమునోత్రి ధామాల ద్వారాలను తెరవబోతున్నారు. అలాగే కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలను మే 2వ తేదీన, బద్రీనాథ్ ధామ్ ద్వారాలను మే 4వ తేదీన తెరుస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com