అమరావతి: వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక హోదాపై చర్చించాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు, ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇందుకు స్పందించిన మంత్రి యనమల రామకృష్ణుడు ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఇది వరకే పలుమార్లు ఈ అంశంపై మాట్లాడామన్నారు. ఒక్కసారి ఒక అంశంపై చర్చించిన తర్వాత మళ్లీ మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదని యనమల స్పష్టం చేశారు.