స్పెయిన్లోని ఆక్లుడియాలో జరిగిన స్పానిష్ పారా ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత అమ్మాయి మానసి జోషి రెండు పతకాలతో మెరిసింది. మహిళల సింగిల్స్లో స్వర్ణం, డబుల్స్లో కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల సింగిల్స్ ఎస్ఎల్-3 ఫైనల్లో మానసి 21-2, 21-7తో కాథరిన్ నాడిన్ (ఫ్రాన్స్)పై గెలిచి చాంపియన్గా నిలిచింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మానసి-జూలీ త్రానె (డెన్మార్క్) జోడీ 10-21, 20-22తో హెలె-కాట్రిన్ (జర్మనీ) జంట చేతిలో ఓడి కాంస్య పతకంతో సంతృప్తిపడింది. ఇదే ఈవెంట్లో మరో భారత పారా షట్లర్ సుకాంత్ కాడమ్ సింగిల్స్లో కాంస్యం, డబుల్స్లో కాంస్య పతకం సాధించాడు.