ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారా బ్యాడ్మింటన్‌లో మానసికి రెండు పతకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2017, 08:42 AM

స్పెయిన్‌లోని ఆక్లుడియాలో జరిగిన స్పానిష్ పారా ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి మానసి జోషి రెండు పతకాలతో మెరిసింది. మహిళల సింగిల్స్‌లో స్వర్ణం, డబుల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్-3 ఫైనల్లో మానసి 21-2, 21-7తో కాథరిన్ నాడిన్ (ఫ్రాన్స్)పై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మానసి-జూలీ త్రానె (డెన్మార్క్) జోడీ 10-21, 20-22తో హెలె-కాట్రిన్ (జర్మనీ) జంట చేతిలో ఓడి కాంస్య పతకంతో సంతృప్తిపడింది. ఇదే ఈవెంట్‌లో మరో భారత పారా షట్లర్ సుకాంత్ కాడమ్ సింగిల్స్‌లో కాంస్యం, డబుల్స్‌లో కాంస్య పతకం సాధించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com