వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ లండన్ పర్యటనపై తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ… డబ్బుల కోసమే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన అన్నారు. హవాలా డబ్బులు తెచ్చేందుకే జగన్ విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని అన్నారు.