అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. నేరాలు.. వాటి ద్వారా కలిగే లబ్ధి ఇప్పుడు వైసీపీకు దొరికిన రాజకీయం అని పేర్కొన్నారు. వైసీపీలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందన్నారు.