ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల బాట పట్టాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర మళ్లీ రూ. 71కి చేరువైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం.. దిల్లీలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 70.91, లీటర్ డీజిల్ ధర రూ. 66.11గా ఉంది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 76.54, డీజిల్ రూ. 69.23 పలుకుతోంది. లీటర్ పెట్రోల్ ధర కోల్కతాలో రూ. 73.01, చెన్నైలో రూ. 73.61గా ఉంది. డీజిల్ ధర కోల్కతాలో రూ. 67.89, చెన్నైలో రూ. 69.84గా ఉంది. గతేడాది చివరితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దిల్లీలో పెట్రోల్ ధరపై రూ. 2.05, డీజిల్ ధరపై రూ. 3.25 పెరిగింది.