ఉండవల్లిలోని సీఎం నివాసంలో సీఎం చంద్రబాబుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ ముగిసింది. జాతీయ రాజకీయాలు, భాజపాయేతర కూటమి బలోపేతంపై చంద్రబాబు, కేజ్రీవాల్ ప్రధానంగా చర్చించుకున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెత్తనం, పశ్చిమ బెంగాల్ లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. పుల్వామా జరిగిన దాడిని బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశముందనే అభిప్రాయానికి వచ్చారు. కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా అమరావతి వచ్చారు.