టీడీపీలో బీసీ మహిళకు ఎప్పుడూ ప్రాధాన్యత వుంటుందని టీడీపీ నాయకురాలు, మాజీ అర్బన్ తెలుగు మహిళా అధ్యక్షురాలు బంకా నాగమణి అన్నారు. రాబోయే ఎన్నికలో పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ టిక్కెట్టు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీలో తాను పార్టీ కోసం ఎన్నో ర్యాలీలు, ధర్నాలు, ప్రజా సమస్యపై బహిరంగ సభలు, ఇంటింటికి తెలుగుదేశం, జన్మభూమి కార్యక్రమాలు తదితర పార్టీ కార్యక్రమాలతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలో పాల్గొన్నామని, ఎమ్మెల్యే, కార్పొరేటరు ఎన్నికలలో అభ్యర్దులకు తన మద్దతు తెలిపి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. టీడీపీలో కష్టపడే ప్రతివారికి ప్రాధాన్యత వుంటుందన్నారు. బీసీకు ప్రాధాన్యత ఇచ్చే సీఎం చంద్రబాబు ఏవిధంగా తమకు దశా దిశా నిర్దేశిస్తే ఆ ప్రకారం బద్ధులమై నడుచుకుంటామని, పార్టీ బలోపేతానికి, క్యాడరు అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. ప్రతిపక్షపార్టీలు చేప్పే అబద్దాలు ఎవ్వరూ వినే పరిస్థితిలో లేరని టీడీపీ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికలో ప్రతిపక్ష పార్టీకు సరైన గుణపాఠం చెబుతారన్నారు.