ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి గుడ్ బై!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2024, 12:11 PM

వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని కూడా వైసీపీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి విడదల రజిని భర్త కుమారస్వామి ఎప్పటినుంచో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.విడదల రజిని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక స్టార్ రేంజ్ లో ఎదిగిన వ్యక్తి.. అధినేత ఆశిస్సులు.. నంబర్ 2 ప్రోత్సాహం కలగలిపి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా అతి తక్కువ రాజకీయ అనుభవంతో బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. బీసీ మహిళా అని చెప్పుకుంటూనే జిల్లాలో ఉన్న అగ్ర నాయకత్వాన్ని మానవత్వం కూడా లేకుండా తొక్కి పడేశారని సమాచారం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com