ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 11:31 AM

 కేరళలో రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మంగళవారం రాత్రి యువకులు అద్దె కారులో మన్నార్‌కట్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.పాలక్కాడ్ - కోజికోడ్ జాతీయ రహదారిపై కల్లడికోడ్ అయ్యప్పన్‌కావ్ సమీపంలో కారు మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కారును పగులగొట్టి ఐదుగురిని బయటకు తీశారు. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పాలక్కాడ్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతులు కొంగాడ్ కీర్మూరిలో మన్నంతర విజేష్ (35), తొట్టల్ ఇంట్లో టివి విష్ణు (28), విందుప్పర రమేష్ (31), మణికస్సేరి మహమ్మద్ అఫ్జల్ (17)లుగా గుర్తించారు. ఐదో వ్యక్తి తాచంపరకు చెందిన మహేష్ అని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com