ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో పర్యటించనున్న వైసీపీ అధినేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 03:30 PM

బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో ఇంటర్ బాలిక హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకు గురైన బాలిక కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించనున్నారు. రేపు కడప జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. గుంటూరు నుంచి హెలికాప్టర్ లో ఆయన బద్వేల్ కు చేరుకుంటారు. బద్వేల్ లోని రామాంజనేయ నగర్ లో ఉన్న బాలిక కుటుంబ సభ్యులను ఆయన కలవనున్నారు. వారిని పరామర్శించి, ఓదార్చనున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకుంటారు. రేపు రాత్రి పులివెందులలో బస చేస్తారు. మరోవైపు, బాలికను హత్య చేసిన విఘ్నేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com