ఏపీ సర్కార్ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేసింది. కేసులు ఎత్తివేస్తూ హోంశాఖ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఎత్తివేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.