ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారందరికి రూ.50వేలు, రూ.25 వేలు.. చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 10:09 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద బాధితులకు సాయం ప్రకటించారు. అలాగే బాధితుల కోసం మరో కీలక ప్రకటన కూడా చేశారు. వరదల్లో నీట మునిగిన ఇళ్లల్లోని బాధితులకు లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లను కోరినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని భవనాల్లో.. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్నవారికి ఇంటికి రూ.50వేల చొప్పున.. మొదటి, అంతకంటే పై అంతస్తుల్లో ఉన్నవారికి రూ.25 వేల చొప్పున రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరినట్లు తెలిపారు. మూడు నెలల మారటోరియంతో.. తర్వాత 36 నెలల్లో ఆ మొత్తాన్ని చెల్లించేలా అవకాశం కల్పించాలని అడిగినట్లు తెలిపారు.


అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో.. షాపులు, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్లు రుణాలపై మారటోరియం కూడా కోరామన్నారు. తాము చేయాల్సిన సాయం చేశామని.. బ్యాంకర్లు కూడా ఏం చేయగలరో చూడాలి అన్నారు. రైతులు తీసుకున్న క్రాప్ లోన్లకు ఐదేళ్లు రీపేమెంట్ చేసేలా.. ఏడాది మారటోరియం విధించాలని బ్యాంకుల్ని అడిగామన్నారు. టర్మ్ లోన్లను కూడా ఇన్సాటల్మెంట్ రీ-షెడ్యూల్ చేసి ఫ్రెష్ టర్మ్ లోన్లు ఇవ్వాలని కోరామని చెప్పారు.


వరద ప్రభావిత ప్రాంతాల్లో శామ్‌సంగ్, బ్లూస్టార్, డైకిన్, గోద్రెజ్‌ లాంటి 14 కంపెనీలకు 3,727 సర్వీస్‌ కాల్స్‌ అందాయని చంద్రబాబు తెలిపారు. వీటిలో 1,400 పరిష్కరించారని.. బైకులు, ఇతర వాహనాల మరమ్మతుల విషయంలో మోసాలు జరగకుండా రవాణా కమిషనర్‌ బాధ్యత తీసుకోవాలని కోరారు. కంపెనీల వర్క్‌షాపులతో పాటు బయట మెకానిక్‌లతోనూ రిపేర్లు చేయించాలని సూచించారు. అర్బన్‌ కంపెనీ ద్వారా 3,748 సర్వీసు రిక్వెస్ట్‌లు రాగా.. 3,569 రిక్వెస్ట్‌లకు సర్వీసు పూర్తిచేశారని తెలిపారు. అంతేకాదు వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందిస్తామని చెప్పారు.. వివిధ రకాల సర్టిఫికెట్లు, రేషన్‌కార్డులు ల్యాండ్‌ రికార్డులు, ఆధార్.. ఇలా ఏం పోయినా సరే వాటిని కూడా అందజేస్తామన్నారు.


విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులకు చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు. విజయవాడలోని 179 సచివాలయాలు, 32 వార్డులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీలు నీటిమునిగాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఒక్కో కుటుంబానికి రూ.25వేలు.. మొదటి, ఆపై ఉన్న అంతస్తుల్లోని ఒక్కో కుటుంబానికి రూ.10వేలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపుబారిన పడ్డ గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఒక్కో కుటుంబానికి రూ.10వేలు అందజేస్తామన్నారు. పంటలకు సంబంధించి కూడా పరిహారం ప్రకటించారు. ఆయా పంటల్ని బట్టి సాయాన్ని ప్రకటించారు చంద్రబాబు.


అంతేకాదు ఈ వరదల్లో నష్టపోయిన చిన్న షాపుల యాజమానులకు రూ. 25 వేలు.. . 40 లక్షల టర్నోవర్ కంటే తక్కువ ఉన్న ఎంఎస్ఎంఇలకు రూ. 50 వేలు.. . 40 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఇకు రూ. 1 లక్ష.. రూ. 1.50 కోట్ల పైన టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఇలకు రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com