ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్‌ఈడీ వీధి దీపాల వెలుగులో పల్లె...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2017, 12:16 AM

విజయవాడ, సూర్య బ్యూరో : ఎల్‌ఈడీ వీధి దీపాల వెలుగుల్లో రాష్ర్టంలోని ప్రతి పల్లె పులకించిపోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. హుద్‌హుద్‌ సమయంలో కేవలం 45 రోజుల్లోనే విశాఖపట్టణంలో ఎల్‌ఈడీ బడ్బులతో వీధి దీపాలు కాంతివంతమైన వెలుగులు విరజిమ్మాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. విద్యుత్‌ను పొదుపుగా వాడుతూనే, కాంతిమంతంగా వున్న ఎల్‌ఈడీ వీధి దీపాలు ప్రపంచ వేదికలను ఆకర్షించాయి. ఇంతటితోనే సంతృప్తి చెందకుండా వీధీ దీపాలు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయో, ఏవీ పాడయ్యాయో తెలుసుకునే సాంకేతిక నైపున్యాన్ని అభివృద్ధి చేయడాన్ని కూడా ఈ సందర్భంగా సీఎం జ్ఞాపకం చేసుకున్నారు. విశాఖ నగరంలో చేపట్టిన ఈ సాంకేతిక నైపుణ్యాలను రాష్ర్టంలోని ప్రతి పల్లెకూ విస్తరించాలని అధికారులను ఆదేశించారు. రూ. 1200 కోట్లతో 13 వేల పంచాయతీల్లో వీధి దీపాలు అమర్చడం వల్ల ఏటా 300 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుందని అధికారులకు సూచించారు. పంచాయతీల్లో వీధి దీపాల అమరికపై ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఇంథన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ట్రాన్‌‌సకో సీఎండీ కె.విజయానంద్‌, పిఆర్‌ కమీషనర్‌ బి.రామాంజనేయులు, ప్రభుత్వ సలహాదారులు (ఇంథన శాఖ) రఘనాథం, సిఇఓ ఎపిసీడ్గకో ఎ.చంద్రశేఖరరెడ్డి, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్‌వై దొర, ఎం.ఎం. నాయక్‌లతో టెలీకాన్ఫరెన్‌‌సను నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్‌‌సలో పంచాయతీల్లో ఏడాదిలోగా వీధి దీపాలు అమర్చాలంటూ దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించి నిర్దేశ గడువు ప్రాతిపదికగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ప్రధానంగా స్పెషల్‌  సీ.ఎస్‌. (గ్రామీణాభివృద్ధి) దినేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్‌, ఇంథన శాఖ ముఖ్య కార్యదర్శులు కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అజయ్‌జైన్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైతే ఈ ప్రాజెక్‌‌టను సత్వరంగా పూర్తి చేయడానికి ఇంథన, పంచాయతీరాజ్‌ శాఖ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్గతో కూడిన త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానంగా మనం ఎప్పుడూ ఒక విషయాన్ని మరవద్దు. 2014కు ముందు అన్ని ప్రాంతాలూ ప్రధానంగా పల్లెలు `కరెంట్‌ కోత' వల్ల దారుణంగా దెబ్బతిన్నాయి. రోజుకు 12 గంటల పాటు కరెంటు కోతలతో ప్రజలు ఆనాడు సతమతమయ్యారు. మరి ఈనాడు ఆ పరిస్థితి లేదు. 24 గంటలపాటు కరెంట్‌ను వందశాతం అన్నీ గృహాలకు అందిస్తున్నాం. దీంతో నేను సంపూర్ణంగా సంతృప్తి చెందడంలేదు. గ్రామీణ ప్రజల్లో జీవన ప్రమాణాలు మరింతగా మెరుగుపడాలి. ఇందుకు గ్రామాల్లో మనం చేపట్టబోయే ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు గణనీయంగా దోహదపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని గ్రామాల సర్పంచ్‌ల్లో అవగాహన కల్పించేందుకు అమరావతిలో రాష్ర్ట స్థాయి ఎల్‌ఈడీ వీధీ దీపాల ఏర్పాటు సదస్సును నిర్వహించాని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్‌‌ట అమలుపై పంచాయతీరాజ్‌ శాఖ మం్తఇ చింతకాయల అయ్యన్నపాు్తడ్రు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామీణ ప్రాతాల ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు అమలుకు సంబంధించి అంతర్జాతీయంగా వున్న ఉన్నత సాంకేతిక ప్రమాణాలను అధ్యయనం చేయాలని, అవసరమైతే వాటిని మన ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలన్నారు. ఈ ప్రాజెక్‌‌టకు సంబంధించి దాదాపు రూ. 1200 కోట్లు వెచ్చించాలని నిర్ణయించినందుకు కేంద్ర విద్యుత్‌, సాంప్రదేయతర ఇంథన శాఖా మంత్రి పీయూష్‌ గోయెల్‌కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com