ప్రపంచంలోనే మొట్టమొదటి బైబిల్ మ్యూజియం ను రాజధాని ప్రాంతంలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబందించిన డిజైన్ లను మంత్రులు పీ. నారాయణ, నక్కా ఆనంద్ బాబులు మంగళవారం సాయంత్రం విజయవాడ ఇంద్రప్రస్త హోటల్ నందు పరిశీలించారు. క్రిస్టియన్ మైనర్టీ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల జోసఫ్ ఇమనియల్, క్రైస్తవ మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని వివరించారు. క్రైస్తవులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హమీ మేరకు రాజధాని ప్రాంతంలో 5 ఎకరాలలో బైబిల్ మ్యూజియంను నిర్మిస్తున్నామని ఇందుకు ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు. బైబిల్ మ్యూజియానికి బైబిల్ గ్రంధంలో ని ప్రముఖమైన చరిత్రత్మక సంఘటనలు, భారతదేశం తోపాటు ప్రపంచంలో ఉండే క్రైస్తవులను క్రైస్తవయేతరులను ఆకర్షించే విధంగా నిర్మించాలని క్రైస్తవ మత పెద్దలు కోరారు. ప్రంపంచంలో ఎక్కడ లేనివిధంగా క్రైస్తవులను, పర్యాటకులను అకర్షించే విధంగా నిర్మించాలని అన్నారు. బైబిల్ గ్రంధములోని చారిత్రత్మక ఆంశాలను ప్రజలకు తెలిసే విధంగా బైబిల్ మ్యూజియం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మ్యూజియంను నిర్మిస్తామని క్రైస్తవ మతపెద్దలకు మంత్రులు హమీ ఇచ్చారు.దీంతో పాటు కోల్ కతా లో ఉన్న ప్రతిష్టాత్మక సిరంపుర్ యునివర్శిటిని రాజధాని ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడానికి 3ఎకరాలు కేటాయించాలని క్రైస్తవ మత పెద్దలు మంత్రులు నారాయణ, నక్కా ఆనందబాబు కు మెమోరండం ఇచ్చారు.