ముంబై : ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ముంబై ఎయిర్పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ముడి బంగారం తరలిస్తున్న ఇద్దరు చైనీయులు, నాగ్పూర్కు చెందిన ఓ జంటను అదుపులోకి తీసుకున్నారు. చైనీయుల నుంచి రూ.37.65 లక్షల విలువైన 1255 గ్రాముల ముడిబంగారాన్ని, నాగ్పూర్ జంట నుంచి 17.55లక్షల విలువైన 585గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.