ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విశాఖకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 22, 2019, 11:43 AM

అమరావతి:  జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలపై దృష్టి సారించనున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై పవన్‌ ఫోకస్‌ చేయనున్నారు. రేపు హైదరాబాద్‌ నుంచి పవన్‌ విశాఖ వెళ్లనున్నారు. రేపు పాడేరు బహిరంగ సభలో పవన్‌ పాల్గొననున్నారు. ఈ నెల 25న విశాఖలో వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, సురవరంలతో జనసేనాని భేటీ కానున్నారు. ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై వామపక్షాల నేతలతో పవన్‌ చర్చించనున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై పవన్‌ సమీక్షలు నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com