ఎక్సైజ్ శాఖలో 20ఏళ్ల దాటిన కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి జవహర్ అన్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాలలో ఎక్సైజ్ సిబ్బంది పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ… ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని ఆదేశించారన్నారు. మద్యం గొలుసు దుకాణాలు అనేక రూపాంతరం చెందుతున్నాయన్నారు. మద్యం గొలుసు దుకాణాలను రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.