విశాఖ పరిధిలోని చీడికాడ మండలంలో తురువోలు గ్రామానికి చెందిన గుల్లిపల్లి రామునాయుడు (72) పాముకాటుతో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందారు. ఎస్ఐ జి.నారాయణరావు తెలిపిన వివరాలివి.. రామునాయుడును ఈనెల 10వ తేదీ ఉదయం పొలంలో పనిచేస్తుండగా పాము కాలిపై కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. ఆయన కుమారుడు అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్టు ఆయన తెలిపారు.