విశాఖ పరిధిలోని కె.కోటపాడుమండలంలోని కింతాడ గ్రామంలో సోమవారం కవనెంట్ ఇంటర్ నేషనల్ బైబిల్ కాలేజీలో విద్యుదాఘాతానికి లోనై జీవన్మగర్ సన్ ఆఫ్ ఉమేష్కుమార్ అనేవిద్యార్థి మృతి చెం దాడు. జీవన్ మగర్ వాటర్ ట్యాంకు మోటార్ పట్టుకోవడంతో షాక్కు గురై పక్కనే ఉన్న ట్యాంక్లో పడిపోయాడు. పక్కనే ఉన్న మెల్లం ప్రదీప్ సాగర్ అతనిని పైకి తీశాడు. వెంటనే కాలేజీ యాజమాన్యం జీవన్ మగర్ను కె.కోటపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు జీవన్ మగర్ నేపాల్ నుంచి వచ్చి 2017లో సీఐబీసీలో ఎండీవీ కోర్సులో చేరారు. అప్పటి నుంచి కాలేజీలో హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు సెలవులకు ఇంటికి వెళ్తూ ఉండేవాడని కళాశాల యాజమాన్యం తెలిపింది. అతను కోర్సు పూర్తి చేసుకొని నేపాల్ వెళ్లడానికి జూలై 15కి రిజర్వేషన్ చేయించుకున్నాడని ఇంతలోనే ఈ ప్రమాదం జరిగినట్టు విచారం వ్యక్తంచేశారు. మెల్లం ప్రదీప్సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.