టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లండి, మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పనిచేస్తారు, అలా చేయకపోతే ఏమవుతుందో ఉద్యోగస్తులకు తెలుసు..అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. వీరి దోపిడీ, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటికి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.