ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 12:35 PM

ఉత్తర కోస్తాలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా నార్పలలో 26.5, చిత్తూరులో 22.5, జీడీ నెల్లూరులో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేకచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. కర్నూలులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాన్‌ ఏర్పడనున్న నేపథ్యంలో ఈనెల 23వ తేదీ తర్వాత ఎండలు పెరిగి వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com