తిరువనంతపురం : కేరళ శబరిమల రూట్ లో ఐదు ఎలక్ట్రికల్ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపారు. ఈ మేరకు కేరళ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ బస్సులను నడపడం ద్వారా కిలోమీటర్ కు రూ.56 ఆదాయం వచ్చిందని ఆ ట్వీట్ లో పేర్కొంది. డీజిల్ బస్సులకు కిలోమీటర్ కు రూ.31లు వ్యయం అవుతుంటే..ఎలక్ట్రిక్ బస్సుల వల్ల కిలోమీటర్ కు అయ్యే వ్యయం కేవలం ఆరు రూపాయలు మాత్రమేనని సీఎం కార్యాలయం పేర్కొంది. కాలుష్య నివారణ లక్ష్యంగా ఎలక్ట్రికల్ బస్సులను విరివిగా వాడకంలోనికి తీసుకురావాలని కేరళ సర్కార్ యోచిస్తున్నది.