న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఖ్యాలా ఏరియాలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి.. మరో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వీరు(41), సునీత(35) దంపతులకు ఆకాశ్(18), కూతురు ఉన్నారు. అయితే సునీత కూతురు తన బాల్కనీలో నుంచి బాటిల్ను బయటకు పడేసింది. ఈ బాటిల్ మహ్మద్ అహ్మద్(40)పై పడింది. దీంతో అహ్మద్ సునీత మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త ముదిరింది. ఇక సహనం కోల్పోయిన అహ్మద్ పదునైన కత్తితో వీరు, సునీత, ఆకాశ్పై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వీరు, ఆకాశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక అహ్మద్ నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తానే వీరు కుటుంబంపై దాడి చేశానని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.