పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆయన కుటుంబం వెల్లడించింది. అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు కారాగారంలోనే చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. షరీఫ్కు మూడేళ్ల కిందట ఓపెన్ సర్జరీ జరిగింది.లాహోర్ జైల్లో ఆయనకు గుండె వ్యాధుల నిపుణులు చికిత్స చేస్తున్నారని, పరిస్థితి విషమంగా ఉందని ఆయన కూతురు మరియం షరీఫ్ అన్నారు. తన తండ్రిని చూడ్డానికి జైలు సిబ్బంది అనుమంతించడం లేదని ఆరోపించారు. అయితే షరీఫ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, దీనిపై రాజకీయాలు చేయడం సరికాదని జైలు సిబ్బంది అంటున్నారు. అల్ జజీరా స్టీల్ మిల్స్కు సంబంధించిన కేసులో నవాజ్ షరీఫ్ కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది.