ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేఘాలయ ఎన్‌జీటీ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్ అక్రమ మైనింగ్

national |  Suryaa Desk  | Published : Sat, Jan 05, 2019, 07:50 PM

బొగ్గు గనుల అక్రమ మైనింగ్‌ను నియంత్రించ లేకపోయినందుకుగానూ మేఘాలయ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) రూ.100 కోట్ల జరిమానా విధించింది. మైనింగ్‌ను బ్యాన్‌ చేయాలని ఎన్‌జీటీ 2014లోనే తీర్పిచ్చింది. అయితే ఈ ఏడాది జనవరి 2న ఎన్‌జీటీ చైర్‌ పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌‌కు ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని చాలా గనులలో ఎలాంటి పర్మిషన్ లేకుండా మైనింగ్ జరుగుతుందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 


ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఎన్‌జీటీ మేఘాలయ ప్రభుత్వానికి రూ.100 కోట్లు జరిమానా విధించింది. రెండు నెలల్లోగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ)కు చెల్లించాలని సూచించింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ప్రభుత్వం అంగీకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. మైనింగ్ కారణంగా గనులలో చిక్కుకుపోయిన 15 మంది కార్మికుల కోసం ఇటీవల మేఘాలయ ప్రభుత్వం రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసింది. కానీ గనుల్లో చిక్కుకుపోయిన వారి జాడ ఇప్పటికీ తెలియరాలేదు. 


మైనింగ్ కేసును విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సైతం తీవ్ర అసహనాన్ని వెల్లగక్కింది. గనుల్లో చిక్కుకుపోయిన వారిని ఎలాగైనా ప్రాణాలతో బయటకు తీసుకురావాలని మేఘాలయ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ మైనింగ్ జరుగుతుంటే వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదిక సమర్పించాలని కోరింది. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com