ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని బకాయిలు తీర్చే ఎన్నికలబరిలో ఉంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 05:21 PM

మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ తెలిపారు. పీఆర్సీని పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. పీఆర్సీ ఆలస్యమైతే.. ఐఆర్‌ కోసం ఆలోచిస్తామని చెప్పాం. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు ముగిశాయి. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 27న చలో విజయవాడను విరమించుకోమని ఏపీ జేఏసీ నేతలను కోరామని, నిర్ణయం సానుకూలంగా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పామన్నారు. మార్చి నెలలో లోపు బకాయిలు చెల్లింపు పూర్తి చేస్తాం అని మళ్ళీ చెప్పామన్నారు. ఐఆర్‌ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వ విధానం కాదని, సమయానికి పీఆర్సీ ఇస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com