గుజరాత్ ప్రభుత్వం గ్రామీణ విద్యుత్తు వినియోగదారులకు వరాన్ని ప్రసాదించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ బిల్లులను రద్దు చేస్తామని విద్యుత్తు శాఖ మంత్రి సౌరభ్ పటేల్ చెప్పారు. తద్వారా 6.22 లక్షల మంది వినియోగదారులు రూ.650 కోట్ల మేరకు లబ్ధి పొందుతారన్నారు. దీనివలన గృహ, వ్యవసాయ, వ్యాపార వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
గుజరాత్ శాసన సభ ఎన్నికలు గత ఏడాదిలో జరిగాయి. 182 మంది సభ్యులు ఉన్న ఈ శాసన సభలో బీజేపీ కేవలం 99 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీ చెప్పుకోదగిన విజయం సాధించలేకపోవడానికి వ్యవసాయ సంక్షోభం కూడా ఓ కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్రామీణుల మద్దతును సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకున్నదని భోగట్టా