అనంతపురం : కొండవీడు ఎక్స్ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్య అనే గర్భిణిపై దుండగులు దాడికి దిగారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కునేందుకు యత్నించారు. వారి బారినుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో దివ్యను దొంగలు రైలులోంచి తోసేశారు. ఈ ఘటనలో గర్భిణికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న రైల్వే పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.