అమరావతి: తుని-యానాం మధ్య ఇవాళ మధ్యాహ్నం పెథాయ్ తుపాను తీరం తాకనుంది. కాకినాడకు 360 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పెథాయ్ తీరంవైపు దూసుకొస్తున్నది. తుపాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను గమనాన్ని ఆర్టీజీఎస్ అధికారులు అనుక్షణం గమనిస్తున్నారు. తుపాను సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకూడదని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో రహదారులపై తిరగరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు చెట్ల కింద ఉండరాదని తెలిపారు. తుపాను సాయం కోసం 1100 కాల్సెంటర్కు ఫోన్ చేయాలని అధికారులు వెల్లడించారు. పెథాయ్ ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.