ఉత్తరప్రదేశ్లో రోడ్లు రక్తమోడుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డుప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారని పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం సాయంత్రం ఆగ్రా-అలీఘర్ రహదారిలోని కండౌలి వద్ద కారు, ట్రక్కుఢీ కొన్న ఘటనలో ఐదుగురు చనిపోయారని తెలిపారు. ముగ్గురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో..మరొకరు చికిత్స అందిస్తున్న సమయంలో మరణించారని వెల్లడించారు. మరో ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి...ఫజియాబాద్ నుండి గజియాబాద్కు కారులో బయలు దేరిన ఒక కుటుంబం..మార్గమధ్యంలో వారి ప్రయాణిస్తున్న వాహనం రహదారి డివైడర్ను ఢీకొీట్టి బోల్తా పడటంతో ముగ్గురు చనిపోయారని పోలీసులు పేర్కొన్నారు.