చెన్నై : ఎఐఎడిఎంకె ఎమ్మెల్యే అరుణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలో చేరారు. దీనితో పన్నీర్సెల్వం వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరుకుంది. కోయంబత్తూర్ నార్త్ నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన అరుణ్కుమార్ నేడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం నివాసానికి చేరుకుని ఆయనకు తన మద్దతు ప్రకటించారు. ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో కలిసి కూవత్తూర్ రిసార్ట్స్లో ఉన్న అరుణ్కుమార్ అక్కడినుంచి నిశ్శబ్దంగా బైటకు వెళ్లిపోయి తన నియోజకవర్గమైన కోయంబత్తూరుకు చేరారు. గత నెల జరిగిన పళనిస్వామి విశ్వాస తీర్మానంలో ఆయన పాల్గొనలేదు.