తిరువనంతపురం: శబరిమల వివాదం ఇంకా రాజుకుంటూనే ఉన్నది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న మహిళలు ప్రవేశించవచ్చు అని సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత.. ఆ రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రాష్ట్ర బీజేపీ పార్టీ మరో సారి ఆందోళనకు దిగుతున్నది. సెక్రటేరియేట్ ముందు ఆ పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఏఎన్ రాధాకృష్ణనన్ దీక్షను ఇవాళ ప్రారంభించారు. 14 రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలు కూడా దీక్షలో పాల్గొంటున్నారు. సీఎంఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని ఎంపీ సరోజ్ పాండే ఆరోపించారు. సుప్రీం ఇచ్చిన తీర్పును సీఎం విజయన్ ప్రభుత్వం సమర్థించడంతో రాష్ట్రంలో అలజడి పరిస్థితి నెలకొన్నది.