ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవాదాయశాఖలో డీసీ, ఏసీ పోస్టుల పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:59 AM

ఏపీలోని దేవాదాయశాఖ పరిధిలో సంయుక్త కమిషనర్‌ (జేసీ), ఉప కమిషనర్‌ (డీసీ), సహాయ కమిషనర్‌ (ఏసీ), గ్రేడ్‌-1 ఈఓ పోస్టుల సంఖ్యలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డీసీ, ఏసీ పోస్టులను పెంచగా, జేసీ, గ్రేడ్‌-1 ఈఓ పోస్టుల సంఖ్యను తగ్గించింది.
ప్రస్తుతం డీసీ కేడర్‌ పోస్టులు 15 ఉండగా.. వాటిని 29కి పెంచారు. అందులో ఒక పోస్టును దేవాదాయ కమిషనరేట్‌కు కేటాయించారు. ఏసీ కేడర్‌ పోస్టులు 56 ఉండగా వాటిని 60కి పెంచారు. గ్రేడ్‌-1 ఈఓ కేడర్‌ పోస్టులు 168 ఉండగా వాటిని 152కి తగ్గించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com