ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీక సోమవారం కావడంతో,,,,,శ్రీశైలం పెరిగిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2023, 09:19 PM

శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు.. అందుకే ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.


అలాగే ఆలయం ముందు భాగంలో ఉన్న గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్‌మెంట్‌లలో పాలు, బిస్కెట్లు, అల్పాహారం అందిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.


శ్రీశైలంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. పలువురు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. పాతాళగంగమ్మకు కర్పూర హారతులు ఇచ్చారు. ఆలయ ఉత్తరమాడవీధి, గంగాధరమండపం వద్ద భక్తులు పెద్దఎత్తున కార్తిక దీపారాధనలు చేశారు. ఈనెల 12తో కార్తిక మాసోత్సవాలు ముగియనుండడంతో భక్తుల రద్దీ ప్రతి రోజూ కొనసాగుతోంది. మరోమైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com