లాహౌల్ – స్పిటి ప్రాంతంనుంచి మనాలికి రోహ్తాంగ్ టన్నెల్ ద్వారా వెళ్లడానికి ప్రయత్నించిన కొందరు మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం అందగానే అధికారులు హుటాహుటిన వెళ్లి సొరంగంలో నుంచి వారిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు. రోహ్తాంగ్ పాస్ రహదారి మూసివేయడంతో అక్కడ నిర్మిస్తున్న టన్నెల్ ద్వారా వెళ్లడానికి సుమారు 80 మంది ప్రయత్నించారు. అయితే వారికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. మంగళవారం ఉదయం 5 గంటలనుంచి అన్నపానీయాలు లేకుండా అలాగే కూర్చున్న వారు అర్ధరాత్రి దాటిన తరువాత బలవంతంగా 8 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలోకి ప్రవేశించారు. కానీ సగం దూరం వెళ్లిన తరువాత వారు స్పృహ తప్పి పడిపోయారు.