స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరసగా రెండోరోజు కూడా క్షీణించాయి. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో సోమవారం రూ.50 తగ్గిన 10 గ్రాముల పసిడి ధర మంగళవారం రూ.100 తగ్గి రూ.32,000 స్థాయికి చేరింది. పసిడి ధరలు తగ్గడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.32,000 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,8500 కి చేరింది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,800 వద్దే కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు.. స్థానిక నగల తయారీదారుల నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో బంగారం ధర తగ్గిందని పారవర్గాలు అంటున్నాయి.
బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి కూడా రూ.200 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.37,900కి చేరింది. రూ.200 తగ్గిన ధర వెండి ధర రూ.200 తగ్గడంతో.. రూ.37,900కి చేరింది. మరోవైపు వారంతపు డెలివరీ ధరలు రూ.251 తగ్గి రూ.36,769 కి చేరింది.100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్దే కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,080 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,530 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర రూ.41,200 వద్ద కొనసాగుతున్నాయి. దేశీయంగా బంగారం ధరలు పతకంకాగా.. అంతర్జాతీయంగా మాత్రం పసడి పరుగులు పెట్టింది. బంగారం ధరలు 0.09 శాతం పెరిగి 1,266 డాలర్లకు చేరింది. వెండి ధరల్లోనూ పెరుగుదల కనిపించింది. వెండి ధర 0.07 శాతం పెరిగి 14.50 డాలర్లకు చేరింది.