ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమతా బెనర్జీతో ముగిసిన చంద్రబాబు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 05:17 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ ముగిసింది. మమతా బెనర్జీతో గంటన్నరకుపైగా జరిగిన సమావేశంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు ప్రయత్నాలపై చర్చ జరిగింది. చంద్రబాబుతో పాటు మంత్రులు కళా వెంకట్రావు, యనమల, ఆనందబాబు కూడా ఉండగా ఢిల్లిలో రాహుల్‌ అధ్యక్షతన బీజేపీయేతర కూటమి సమావేశం, స్థానికంగా కాంగ్రెస్‌, వామపక్షాలతో మమతకు ఉన్న సమస్యల అంశం, జాతీయ స్థాయిలో ఐక్యంగా పోరాడే దిశగా కార్యాచరణపై చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. మరికాసేపటిలో మమతా, చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com