విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు స్క్రిప్ట్ ను చదువుతున్నానని వైసీపీ అధికార ప్రతినిధి పీజే సుధాకరబాబు మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కులపరమైన వ్యాఖ్యలు చేయడం తగదన్న సుధాకరబాబు చంద్రబాబు తరపునే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పనిచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు మధ్య లింగమనేని రమేష్ మధ్యవర్తిత్వం చేస్తున్నారని.. ప్రశ్నిస్తానని చెప్పి రాజకీయాలలోకి వచ్చిన పవన్ తన ప్రసంగాలలో అరుపులు, కేకలు తప్ప అసలు విషయం లేదన్నారు. చంద్రబాబు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లుగా ఉందని.. పవన్ తన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. టిడిపికి మద్దతు ఇస్తే చంద్రబాబు ఎన్ని ముడుపులు ఇచ్చారని ప్రశ్నించిన ఆయన పవన్ తన నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.