పోలవరం డయాఫ్రం వాల్ పనులు వందశాతం పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ…. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక యంత్రాలు ఉపయోగించి పనులు చేశామని తెలిపారు. డయాఫ్రం వాల్ ఎక్కడ ఉంటుందో కూడా జగన్ కు తెలియదన్నారు. రైతులు, ప్రజల కల సాకారం చేసేందుకు చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు.