చెన్నై : తమిళనాడులో అనర్హత వేటు పడిన 18 ఎమ్మెల్యేల విషయంలో ఉప ఎన్నికలకు వెళ్లాలని టిటివి దినకరన్ యోచిస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టుకు వెళతారని ముందుగా ప్రచారం జరిగింది. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం సరైనదేనని మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది. దీనితో ఉప ఎన్నికలకు వెళ్లాలని దినకరన్ వర్గం భావిస్తోంది.