ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ దుర్గమ్మ ఆలయం మూసివేత.. దర్శనాలు కూడా రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 08:24 PM

విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 28న సాయంత్రం 6.30 గంటలకు దుర్గగుడికి కవాట బంధనం చేస్తున్నట్లు (ఆలయ తలుపులు మూసివేత) ఈవో భ్రమరాంబ తెలిపారు. 29న తిరిగి వేకువజామున 3 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలకు కవాట ఉద్ఘటన (ఆలయ తలుపులు తెరవడం) కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం స్నపనాభిషేకం అలంకరణ, హారతి అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారని పేర్కొన్నారు. 29న ఉదయం నిర్వహించే సుప్రభాత సేవ, వస్త్రసేవ, ఖడ్గమాలార్చన నిలుపుదల చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి జరిగే ఇతర ఆర్జిత సేవలు యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.. దూరం నుంచి వచ్చే వాళ్లు అందుకు తగినట్లుగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. విజయవాడ మాత్రమే కాదు.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా ఈ నెల 28న రాత్రి నుంచి 29 ఉదయం వరకు మూసివేయనున్నారు. ఆలయ శుద్ధి తర్వాత పూజలు నిర్వహించి స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలలతో పాటుగా అన్ని గుడులు మూతపడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com