విజయవాడ: అమరావతిలో మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఏపీలో బీజేపీ అంటే అంటరాని పార్టీగా చూస్తున్నారని.. బీజేపీ నేతలు సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్య తిరుగుతారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ద్రోహుల ముఠా అగ్రిగోల్డ్ బాధితుల తరపున దీక్షలు చేస్తోందని.. మోదీ తొత్తులుగా ఉన్న ఈ ద్రోహుల ముఠా మాటలు ప్రజలు నమ్మరన్నారు. జివిఎల్ ప్రతిరోజు చంద్రబాబు ,లోకేష్ పై అవాస్తవాలు మాట్లాడడమే పనిగా పెట్టుకున్నాడని.. జివిఎల్ కు గుజరాత్ లో 200 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయని.. నీ అక్రమ ఆస్తులపై నేను చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి కంపెనీలు రాకుండా జివిఎల్, కన్నా భయపెడుతున్నారన్న వెంకన్న అమిత్ షా కుమారుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని ప్రశ్నించాడు. అగ్రిగోల్డ్ ఆస్తులపై అమిత్ షా, వాళ్ళ కొడుకు కన్ను పడిందని.. అమిత్ షా కొడుకుకు అగ్రిగోల్డ్ ఆస్తులను కట్టబెట్టడానికి బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని అయితే మీరు ఎన్ని కుట్రలు చేసినా అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు.