ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాంధీ సమాధి వద్ద నిరసనలు తెలిపిన టీడీపీ ఎంపీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 12:22 PM

టీడీపీ యువనేత  నారా లోకేశ్, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మంగళవారం ఉదయం ఢిల్లీ రాజ్‌ఘాట్‌ లోని గాంధీ సమాధి వద్ద లోకేష్, ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించి నల్ల రీబెన్‌లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ.....  న్యాయస్థానంలో ఈ రోజు తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం ధర్మంపై నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com