గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కారుమంచిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జేవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.