గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. ఆయన గత కొంత కాలంగా పాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న పారికర్ ఇటీవలే అమెరికాలో చికిత్స చేయించుకొని తిరిగి వచ్చారు. రెండు రోజుల క్రితం గోవాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న పారకిర్ మెరుగైన చికిత్స కోసం ఇవాళ ఉదయం ఎయిమ్స్లో చేరారు. ఆయనకు కొన్ని పరీక్షలు జరుపనున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక పేర్కొంది. ఈలోగా సీఎం నిర్వహిస్తున్న శాఖలను వివిధ మంత్రులు చూస్తారని గోవా స్పీకర్ మైఖెల్ లాబొ తెలిపారు.