నెల్లూరుజిల్లాలో తూర్పు రాయలసీమ పట్టభ్రదులు, ఉపాద్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. ఈ నెల 9న జరగబోతున్న ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు తెలిపారు.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 67,547 ఓట్లుండగా వాటికి 85 పోలీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 5,923 ఓట్లున్నాయని వాటికి నిర్వహణకు 48 పోలీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలీంగ్ నిర్వహణకు 357 బ్యాలెట్ బాక్స్ లు సిద్దం చేశామన్నారు. ఎన్నికల నిర్వహణపై నాలుగు రోజుల పాటు ఏపీవోలకు, పీవోలకు శిక్షణనిచ్చామన్న ఆయన ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరక్కుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు