ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని హింద్మాతా ఏరియాలోని క్రిస్టల్ టవర్లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. క్రిస్టల్ టవర్లోని ఓ అంతస్తులు మంటలు చెలరేగాయి. దీంతో ఆ టవర్లో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. క్రిస్టల్ టవర్ వద్దకు చేరుకున్న 10 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. భారీ క్రేన్ల సహాయంతో టవర్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.