ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. ఇక్కడి ఫ్లోరెస్ సముద్రంలో ఏర్పడగా, భూమి కూడా స్వల్పంగా కంపించిందని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఇండోనేషియాకు 109 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా ఉన్న కంబుంగ్బజో గ్రామంలోని 539 లోతులో ఈ భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. లోతైన భూకంపాల వల్ల తీవ్రత తక్కవగా ఉంటుందని పేర్కొంది. ఈ నెల 7న లాంబోక్ ద్వీపంలో భూకంపం సంభవించగా సుమారు 400 మంది మరణించిన సంగతి తెలిసిందే.