అమరావతి: భారీ వరదల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం 3 లక్షల 11 వేల క్యూసెక్కులుగా ఉంది. 885 అడుగులకు 877 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతుంది. దీంతో కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున విద్యుత్ చేస్తూ సాగర్ లోకి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.